ఎదులాపురం, మార్చి22: తెలంగాణ ఏర్పా టు తర్వాత బీఆర్ఎస్తోనే ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని దస్నాపూర్ రామాలయ ప్రాంగణంలో రూ.5 లక్షలతో షెడ్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ముందుగా కాలనీప్రజలు ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ భరత్, పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, కాలనీ వాసులు పార్వతి, అనిల్, దివిటి రాజు ఉన్నారు.
రామాలయంలో ఎమ్మెల్యే పూజలు
బేల,మార్చి22 : బేల మండలంలోని గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనను సన్మానించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, ఎంపీపీ వనితా ఠాక్రే, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, జక్కుల మధుకర్, మస్కేతేజ్రావు, దేవన్న, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, తాన్బా ఠాక్రే, వారాడే విఠల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉగాది పచ్చడి పంపిణీ
ఆదిలాబాద్ టౌన్, మార్చి 22 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక పూజలు చేశారు. శాంతినగర్లోని సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఐష్టెశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని రైతు బజార్ వద్ద రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న పచ్చడి, గుడాలు పంపిణీ చేశారు. హిందూ ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధి లెనిన్ పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ అనిత ఎమ్మెల్యేకు పలు సమస్యలు వివరించారు. కళాశాల అభివృద్ధికి మరికొన్ని నిధులు కేటాయించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.