న్యూఢిల్లీ, ఆగస్టు 26: విండోస్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ విభాగం.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) కీలక సూచనలు చేసింది. విండోస్ ఓఎస్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్లో పలు లోపాలు గుర్తించామని, వీటి సాయంతో సైబర్ కేటుగాళ్లు ఓఎస్ సెక్యూరిటీ సిస్టమ్ విండోస్ డిఫెండర్ను పనిచేయకుండా చేసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. తద్వారా యూజర్ల కంప్యూటర్పై సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. యూజర్లు తక్షణమే తమ విండోస్ ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.