దిలావర్పూర్ ఫిబ్రవరి 14 : యువత వ్యసనా లకు దూరంగా ఉండాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. న్యూ లోలంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను సోమవారం జిల్లా, మండల అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులను అధికారు లు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ యువకులు క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. స్థానిక సర్పంచ్ ఓడ్నం సవిత, జడ్పీ సీఈవో సుధీర్కూమర్, డీపీవో వెంకటే శ్వర్లు, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ఖాన్, ఏంఈవో శంకర్, ఆర్ఐ సంతోష్, ఎంపీపీ బాబురావు, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, ఎంపీటీసీలు పాల్దె అక్షర, అనిల్, సర్పంచ్లు వీరేశ్కుమార్, మహేశ్, శ్రీనివాస్, నాయకులు ఓడ్నం కృష్ణ, అర్గుల నరేందర్, పంచాయతీ కార్యదర్శులు దిలీప్, స్వాతి, కల్యాణి, ప్రీతి, శ్రావణ్కుమార్, సునీల్ కుమార్, అక్షయ్ నాయక్ మేఘన, క్రీడా కారులు పాల్గొన్నారు.