ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 20: మండలాల్లో ముమ్మరంగా టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ మండల ప్రధాన కార్యదర్శిగా గోసంపల్లి గ్రామానికి చెందిన తూము చరణ్ను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో చరణ్ను శాలువాతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఎమ్మెల్యే రేఖానాయక్కు, పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజగంగన్న, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పత్రి శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కొక్కుల ప్రదీప్, ఎర్వచింతల్ సర్పంచ్ కొడారి గోపాల్, గోగికర్ రాజు పాల్గొన్నారు.
పెంబి మండలాధ్యక్షుడిగా సల్లా నరేందర్ రెడ్డి
ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల సమావేశాన్ని నిర్వహించారు. అన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలు హాజరై పార్టీ కార్యకర్తలందరూ ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడితో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సల్లా నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మాడావి సుంగు పటే ల్, చాడ సంతోష్, పుప్పాల రాజేందర్, కార్యదర్శిగా బానావత్ విలాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా చౌహాన్ వినోద్, కాల రాజు, గుగ్లావత్ జవహర్లాల్, సంయుక్త కార్యదర్శులుగా మోతుకీరి శ్రీనివాస్ గౌడ్, పటేల్ గణేశ్, మొలిగె చిన్నయ్యతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిని పూలమాల, శాలువాతో ఘనం గా సన్మానించారు. వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూక్యా గోవింద్, నాయకులు పీ లక్ష్మీనారాయణ, గాండ్ల శంకర్, సుతారి మహేందర్, ఎంపీటీసీ రామారావు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
పార్టీ పటిష్టానికి నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల టీఆర్ఎస్ నూతన కార్యవర్గాన్ని సోమవారం తన నివాసంలో అభినందించి సన్మానించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కష్టప డి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పడకంటి దత్తు, ఉపాధ్యక్షుడు దత్తురాం, మైనార్టీ, ఎస్టీ విభాగాల బాధ్యులు ఎస్కే ఖాదీర్, పవార్ రాజు, మాజీ జడ్పీటీసీ ప్రకాశ్గౌడ్, కుంటాల గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేశ్, ఆత్మ డైరెక్టర్ పెంట, దశరథ్, నాయకులు టీ రజనీకాంత్, బొంతల పోశెట్టి, తదితరులున్నారు.