నేరడిగొండ, డిసెంబర్ 21 : నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల మెరుగుపరచడానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఎంఈవో కార్యాలయంలో సైన్స్ మెటీరియల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలోని ఏడు పాఠశాలలకు రూ.6 లక్షల నిధులతో సైన్స్ మెటీరియల్ కొనుగోలు చేసి అందించనున్నట్లు వివరించారు. పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరముందన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, వైస్ ఎంపీపీ ఏలేటి మహేందర్రెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో అబ్దుల్సమద్, ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, నాయకులు సయ్యద్ జహీర్, తిత్రే నారాయణసింగ్, కమల్సింగ్, జాదవ్ కపిల్, చంద్రశేఖర్ యాదవ్, ఆడెపు రమేశ్, శ్రీనివాస్రెడ్డి, ఉప్పు పోశెట్టి, గడ్డం భీంరెడ్డి, జాదవ్ గణేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, సీఆర్పీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించాలి
జనవరి 12న జాలంసింగ్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా చూడాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల కేంద్రంలో బానోత్ జాలంసింగ్ విగ్రహ ప్రతిష్ఠాపన పనులు మంగళవారం పర్యవేక్షించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై గ్రామపెద్దలు సమావేశమై చర్చించారు. విగ్రహావిష్కరణకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో నిర్వహించిన తెర్వీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన వెంట సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్ ఆడె సురేశ్, మాజీ జడ్పీటీసీ రూపావతి జ్ఞానోబా పుష్కర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు యూనుస్ అక్బానీ, టౌన్ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, జాదవ్ రెడ్డి నాయక్, గ్రామపెద్దలు ఉన్నారు.