సోన్, జూలై 28 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామంలో 70శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి పనులు చేపట్టడంతో ప్రతినెలా నిధులు వస్తున్నాయి. ఈ నిధులతో సర్పంచ్ ఎల్చల్ గంగారెడ్డి గ్రామసభను ఏర్పాటు చేసి ప్రజా ప్రాధాన్యమున్న పనులకు ఖర్చు పెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, హరితహారంలో ఇంటికో మొక్క, ఊరికో ఉద్యానవనంలో మొక్కలు నాటడం, వైకుంఠధామం, డంప్యార్డు, తదితర నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తి కావడంతో గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. గ్రామంలో సుమారు 5,400 జనాభా ఉండగా.. ఓటర్లు 2,400 మంది ఉన్నారు. సమష్టి కృషితో పల్లె ప్రగతి పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామాన్ని అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుకున్నారు. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు అందించేందుకు ఇప్పటికే 50 మంజూరు కాగా, పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో వీరికి ఇండ్లను అందజేయనున్నారు.
నాడు బురదమయం.. నేడు సీసీ రోడ్లపై పయనం..
పల్లె ప్రగతికి ప్రభుత్వం ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నది. దీంతో వచ్చిన నిధులతో గ్రామంలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. ఇప్పటివరకు రూ.24 లక్షలతో సీసీ రోడ్లు, రూ.31లక్షలతో మురుగు కాలువలను నిర్మించారు. ఏడాది క్రితం ఈ రోడ్లపై నడవాలంటే నరకయాతన పడేవారు. ఈ ఏడాది సీసీ రోడ్లు నిర్మించడంతో ఆ ఇబ్బందులు తీరాయి. గతేడాది వర్షాకాలంలో ఇండ్లలోకి వర్షపునీరు చేరడంతో అంబేద్కర్ కాలనీవాసులు ఇబ్బందులకుగురయ్యారు. ఇప్పుడు మురుగు కాలువలను ప్రణాళికాబద్ధంగా చేపట్టడంతో వర్షపు నీరు ఇండ్లలోకి చేరడం లేదు. పల్లె ప్రకృతివనం చుట్టూ కంచెను ఏర్పాటు చేయడమే కాకుండాసేదతీరేందుకు గుడిసెను ఏర్పాటు చేశారు.
మొక్కల సంరక్షణ బాధ్యత పింఛన్దారులదే..
తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను పింఛన్దారులకు అప్పగించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు రూ.2,016, రూ.3,016 చొప్పున పింఛన్ అందజేస్తున్నది. గ్రామంలో సుమారు 800 మంది పింఛన్ దారులున్నారు. వారి ఇంటి ముందు నాటిన మొక్కలకు ప్రతిరోజూ ఉదయం, సాయం త్రం నీటిని పట్టడం, పశువులు మొక్కలు తినకుండా కంచెను ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయడంతో ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగాయి. వర్షాకాలంతో పాటు మురుగు కాలువల్లోని నీటిని సంరక్షించేందుకు సామూహిక ఇంకుడుగుంతలను నిర్మించారు. గ్రామ శివారులో ఖాళీ ప్రదేశాలను గుర్తించి 100 ఫీట్ల ఇంకుడుగుంతలను నిర్మించి నీటిని ఇంకేలా చేస్తున్నారు. దీంతో గ్రామంలో భూగర్భజలాలు పెరుగుతున్నాయి.
పచ్చదనంతో గ్రామం కళకళ..
2019లో అప్పటి కలెక్టర్ ప్రశాంతి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇప్పుడు అవి పెరిగి పెద్దగవ్వడంతో పచ్చదనంతో కళకళలాడుతు న్నాయి. ప్రతినెలా ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలను నిర్మించాం. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో గ్రామంలో ఇప్పటివరకు రూ.24 లక్షలతో సీసీ రోడ్లు, రూ.31 లక్షలతో మురుగు కాలువలు నిర్మించాం. భారీ వర్షం పడినా గ్రామంలో నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా కేవలం 10 నిమిషాల్లోనే వెళ్లిపోతుండడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమష్టి కృషితోనే ‘ప్రగతి’పథంలో..
గ్రామస్తుల సహకారంతోనే పాక్పట్ల గ్రామంలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేశాం. పల్లె ప్రగతి ద్వారా ప్రతినెలా నిధులు వస్తున్నా యి. ఆ నిధులను ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తు న్నాం. గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించి డంప్ యార్డు లకు తరలిస్తున్నాం. దీంతో గ్రామం పరిశుభ్రంగా తయారైం ది. హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత కూడా పింఛన్దారులకు అప్పగించాం. అన్ని కాలనీల్లో నాటిన మొక్కలు చెట్లుగా పెరిగాయి.