ఇంద్రవెల్లి, డిసెంబర్ 30 : గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా ఆలయ నిర్మాణ పనులు త్వర గా పూర్తి చేయాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. మండలంలోని నాగోబా ఆలయ నిర్మాణ పనులను గురువారం వారు పరిశీలించారు. అనంతరం మండలంలోని గౌరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చిత్తబట్ట మట్టిరోడ్డు మరమ్మతుల కోసం మాజీ ఎంపీ, జడ్పీ చైర్మన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ భూమిపూజ చేశారు. మోహన్సింగ్తండాలో సీసీరోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ హయాంలోనే ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు శాశ్వతమైన బీటీరోడ్లు నిర్మించిందన్నారు. జడ్పీ నిధులతో గ్రామాల్లో సీసీరోడ్లతోపాటు మట్టిరోడ్ల పనులు చేస్తున్నారని తెలిపారు. కెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణకు యేటా ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తున్నదని గుర్తు చేశారు. నాగోబా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసి వివిధ రకాల పనులు చేస్తున్నదన్నారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్లు కోవ ఫాత్మాబాయి, మడావి కామేశ్వరి, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు షేక్ సుఫియాన్, నాయకులు తొడసం హరిదాస్, మెస్రం తుకారాం, ఆత్రం ధర్ము, కోరెంగా సుంకట్రావ్, కోరెంగా సుంగుపటేల్, కోవ లాల్షావ్, మడావి భీంరావ్, కనక అశోక్, కనక హనుమంత్రావ్, మర్సుకోల తిరుపతి, దశరథ్ పటేల్ పాల్గొన్నారు.
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. మండలంలోని తుమ్మగూడ గ్రామానికి చెందిన నంది యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను వారు ప్రారంభించారు. క్రీడాపోటీలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మ ద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచ్ మడావి షేకు, గ్రామపటేల్ సోయం మాన్కుపటేల్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు షేక్ సుఫియాన్, నాయకులు అనిల్రాథోడ్, రాంషావ్, దశరథ్ పటేల్, సుంకట్రావ్, మర్సుకోల తిరుపతి, నంది యూత్ సభ్యులు ఆత్రం గణేశ్, సోయం దినేశ్, సంబు తదితరులు పాల్గొన్నారు.