ఆదిలాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే(65) బుధవా రం గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి ఆ యన సొంత గ్రామమైన నార్నూర్ మండలంలోని గుంజాలలో హార్ట్ ఎటాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు నాందేవ్ను వెంటనే చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించా రు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాందేవ్ మృతిపై ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతోపాటు సొంత గ్రామమైన గుంజాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాందేవ్ కాంబ్లేకు తొమ్మిది మంది సంతానం. ఇందులో ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చాడు.
సమస్యల పరిష్కారంలో చెరగని ముద్ర
డీసీసీబీ చైర్మన్గా నాందేవ్ కాంబ్లే ప్రజల సమస్యల పరిష్కారంలో చెరగని ముద్ర వేశారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్గా నార్నూర్లో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందున్నారు. 32 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. విద్యుత్ కాంట్రాక్టర్గా పలు గ్రామాలకు కరెంటు సౌకర్యం కల్పించారు. నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్గా, డైరెక్టర్గా రైతులు, ప్రజల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. ఆయన 1991లో నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్గా పనిచేశారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్గా ఆరు సార్లు ఎన్నికయ్యారు. 1996లో ఆదిలాబాద్ డీసీసీబీ వైస్ చైర్మన్గా ఉండగా డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి మృతి చెందాడు. అప్పుడు ఆరు నెలలపాటు డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. 2018లో టీఆర్ఎస్లో చేరారు. నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్గా ఎన్నికగా.. గతేడాది ఫిబ్రవరి 29న డీసీసీబీ చైర్మన్గా ఎన్నికై 17 నెలలుగా ఈ పదవిలో ఉన్నారు.
చివరి సమావేశంలో కూడా..
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జరిగిన నష్టంపై మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే నార్నూర్ మండలం మల్లంగి, మాలేపూర్ గ్రామాల ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ గ్రామాల్లో రోడ్లు నిర్మించాలని, వంతెనలు బాగు చేయించాలని మంత్రిని కోరారు. మధ్యాహ్నం సమయంలో సమావేశానికి హాజరైన ఆయన మరుసటి రోజు ఉదయం హఠాన్మరణం చెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే మృతిపై రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఇతర నాయకులు నాందేవ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
మంత్రి అల్లోల సంతాపం..
డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే మృతిపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీసీసీబీ చైర్మన్గా ఆయన అందించిన సేవలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే..
ఖానాపూర్ టౌన్, జూలై 28 : ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సంతాపం తెలిపారు. నాందేవ్ కాంబ్లే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముథోల్ ఎమ్మెల్యే..
భైంసా, జూలై 28 : నాందేవ్ కాంబ్లే మృతిపై ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బోథ్ ఎమ్మెల్యే..
తాంసి, జూలై 28 : మండలంలోని బండలనాగాపూర్లో నిర్వహించిన నాందేవ్ కాంబ్లే సంతాప సభలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. అందరితో మర్యాదపూర్వకంగా మెలిగేవారని తెలిపారు. తనకు మంచి మిత్రుడని పాత విషయాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి ఆదిలాబాద్ జల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎంపీపీలు సురుకుంటి మంజుల, సంతోష్, జడ్పీటీసీలు తాటిపెలి రాజు, కుమ్ర సుధాకర్, ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, సర్పంచ్లు వెంకన్న, సదానందం, కేశ్వ్రెడ్డి, నర్సింగ్, ఎంపీటీసీలు రఘు, అశోక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, నాయకులు అరుణ్కుమార్, దాసు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూలై 28 : ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదిక భవనంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బాపురావ్ మౌనం పాటించి నాందేవ్ కాంబ్లేకు శ్రద్ధాంజలి ఘటించారు. వెనుకబడిన దళిత గిరిజన ప్రాంతం నుంచి రాజకీయ రంగంలో ఎదిగి, ఈ ప్రాంతవాసులకు ఎనలేని సేవలు చేసి, చిరస్మరణీయుడిగా నిలిచారని గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
జడ్పీ చైర్మన్, డీడీసీ చైర్మన్..
నార్నూర్, జూలై 28 : రాజకీయ, సమాజానికి ఎనలేని సేవలందించిన నాందేవ్ కాంబ్లే మరణం తీరని లోటని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని కేర్ దవాఖానలో భౌతిక కాయం వద్ద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దళిత సమాజ ఉన్నతికి, ఏజెన్సీలోని గిరిజనేతరుల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం శ్రమించే నాయకుడి మృతి చాలా బాధాకరమని వారు పేర్కొన్నారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.