ఉట్నూర్ రూరల్, నవంబర్ 9 : పోడు భూముల దరఖాస్తులు స్వీకరించే గ్రామ కమిటీలను త్వరగా ఎంపిక చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. మండలంలోని ఘన్పూర్ పంచాయతీ పరిధిలోని కల్లూర్గూడ గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న కమిటీ ఎన్నికలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం సభ్యులు ఉండేలా చూడాలన్నారు. పోడు భూముల పంపిణీతో అర్హులైన గిరిజనులకు లబ్ధి చేకూరనున్నదని చెప్పారు. అనంతరం గ్రామ సభలో ఎన్నుకున్న చైర్మన్కు ఏ ఫామ్ అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్వో గోవింద్రావు, ఎఫ్బీవో స్వాతి, పంచాయతీ కార్యదర్శి రాదేశ్యాం, పెసా మొబలైజర్ కౌసల్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో జాయింట్ లయబిలిటీ గ్రూప్ సభ్యులకు ఐటీడీఏ ద్వారా రూ. 40 లక్షల విలువైన ట్రాక్టర్, కాంక్రీట్ మిక్సర్తో పాటు ఇతర పరికరాలు మంజూరు కాగా ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో భీంరావు, పీహెచ్వో రమణ, ఏవో రాంబాబు పాల్గొన్నారు.