పెంబి/దస్తురాబాద్/ కడెం, జూలై 28: హైదరాబాద్లోని దూలపల్లి అకాడమీ నుంచి వచ్చిన 27 మంది ట్రైనీ ఎఫ్ఎస్వోలు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా నిర్మల్ జిల్లాలోని పెంబి, దస్తురాబాద్, కడెం మండలాల్లో బుధవారం పర్యటించారు. పెంచి మండలంలోని మందపల్లి అటవీ ప్రాంతం, దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం శివారులో ఉన్న కేసీఆర్ హరిత వనం, కడెం మండలంలోని లక్ష్మీపూర్ బీట్ అటవీ ప్రాంతంలో బుధవారం శిక్షణ పొందారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం పెంచిన గడ్డి క్షేత్రాలు, నీటి కుంటలను పరిశీలించారు. వీరికి అడవులు, వన్య ప్రాణుల సంరక్షణ, విధినిర్వహణలో పాటించాల్సిన నియమాలపై ఆయా చోట్ల స్థానిక అధికారులు అవగాహన కల్పించారు. కడెం జలాశయం వద్ద ఎగువ ప్రాంతాల అటవీని పరిశీలించిన అనంతరం బోటులో విహరించారు. ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. ఆయాచోట్ల ఖానాపూర్ ఎఫ్ఆర్వో వినాయక్, కడెం ఎఫ్ఆర్వో అనిత, డీఆర్వోలు లక్ష్మీనారాయణ, మమత, ఎఫ్ఎస్వో శ్రీలత, ఎఫ్బీవో అలీం, తదితరులున్నారు.
కొత్త విషయాలు నేర్చుకున్నాం..
కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని నాలుగు మండలాల్లో అటవీ ప్రాంతాన్ని పరిశీలించాం. ఎంతో కొత్త అనుభూతి కలిగింది. చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం. క్షేత్రస్థాయి పర్యటనల్లోనే మనకు అవగాహన ఎక్కువ కలుగుతుంది. అకాడమీ నుంచి మూడు రోజుల శిక్షణ తరగతుల కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. ఇక్కడి అటవీ ప్రాంత అధికారులు మాకు ఎన్నో విషయాలను తెలియజేశారు. జంతువులు,వాటి ఆహారం, నీరు, నీడ, మొక్కలు, వాచ్ టవర్స్ తదితర అంశాలపై చక్కగా వివరించారు.
-డీ బాలకృష్ణ, ఆదిలాబాద్
శిక్షణ సమయం ఎంతో కీలకం
శిక్షణలో భాగంగా కవ్వాల్ అభయారణ్యం చేరుకు న్నాం. అటవీ సంరక్షణ కోసం మేం భవిష్యత్లో నిర్వర్తించాల్సిన విధులను క్షుణ్ణంగా పరిశీలించి, తెలుసుకునే అవకాశం కలిగింది. ఇక్కడ అను భ వం ఉన్న అధికారులు మాకు ఉపయోగపడే ఎ న్నో అంశాలను నేర్పించారు. అటవీ ప్రాంతా ల్లో తిరిగి, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, ప్రతి అంశాన్ని తెలుసుకునే అవకా శం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా.
– గీత, అమ్రాబాద్, మహబూబ్నగర్
మంచి అనుభూతినిచ్చింది
క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా ఖానాపూర్ డివిజన్లో పర్యటిస్తున్నాం. సీనియర్ అటవీ అధికారులు పని చేసే విధానాన్ని తెలుసుకు న్నాం. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం వారు తీసుకుంటున్న చర్యలు మాకు చక్కగా వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులుల ఆవాసం, సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు తెలుసుకున్నా. అడవిలో పర్యటిస్తున్నప్పుడు వివిధ రకాల వన్య ప్రాణులను చూసినప్పుడు మంచి అనుభూతి కలిగింది. నాకైతే ఇదో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. భవిష్యత్లో మేం విధుల్లో భాగంగా చేసే పనులను ఇక్కడ తెలుసుకున్నాం.
-పీ రవి, ట్రైనీ ఎఫ్ఎస్వో