బీజేపీ, కాంగ్రెస్ వారే సమాధానం చెప్పాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్లాంటి అరుదైన పథకాలు మరే రాష్ట్రంలోనైనా ఉన్నాయా? బీజేపీ, కాంగ్రెస్ నా యకులే సమాధానం చెప్పాలని ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్న సవాల్ విసిరారు. ఆదిలాబాద్ మండలం అంకోలిలో రూ.20 లక్షల తో సీసీ రోడ్ల నిర్మాణాలకు సోమవారం ఆయన భూమి పూజచేశారు. 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ విషయంలో స్థానిక ఎంపీ, బీజేపీ నాయకులు కేంద్రంతో కనీస ప్రయత్నమైనా చేయడం లేదని గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్నింటినీ ప్రైవేట్పరం చేయాలనుకోవడం ఎవరి లబ్ధికోసమో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర,కేంద్ర ప్రగతి గురించి తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అందుకు బీజేపీవారు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్, ఎంపీటీసీలు జంగుపటేల్, జంగుబాపు, సర్పంచు భూమన్న, ఉపసర్పంచ్ పురుషోత్తం, టీఆర్ఎస్ నాయకులు సెవ్వ జగదీశ్, కిషన్, గంగయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, పీఏసీఎస్ డైరెక్టర్ చంటిబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోనేరావు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ కనక రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..
ఎదులాపురం, ఫిబ్రవరి 14 : ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే జోగు రా మన్న పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని వైటీసీలో యువజన సర్వీసుల శాఖ, నాబార్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు ఎమ్మెల్యే, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సర్టిఫికెట్లు అందజేశారు. అం తకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమా న్ని ప్రాంరభించారు. జిల్లాలో మరిన్ని జాబ్మేళాలు నిర్వహించి ఎక్కువ మంది నిరుద్యోగ యువతీయువకులకు హైదరాబాద్లోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశా రు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జిల్లా యువజన సర్వీసుల సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు అబ్బాస్, అద్రిజా, శిక్షణా కేంద్రం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి..
జైనథ్, ఫిబ్రవరి 14 : ఆధ్యాత్మిక నిలయాలై న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎ మ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలో ని గిమ్మలో అభయాంజనేయస్వామి, రేణుకా ఎల్లమ్మ, జిల్లేడు గణపతి, బ్రహ్మంగారి ఆలయాల సముదాయానికి భూమిపూజ చేశారు. సుందరగిరిలో వీరబ్రహేంద్రస్వామి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. గిమ్మలో ఆలయ స ముదాయానికి ఎకరం భూమి విరాళంగా అందజేసిన ముత్తన్న, శివ్వన్న, సోమన్నను అభినందించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎం పీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, సర్పంచులు ఊశన్న, భోజన్న, గిమ్మ సంతోష్ పాల్గొన్నారు.