రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం అంబకంటి గ్రామంలో 48మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్లను స్థానిక ఎంకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 19,576 మందికి ఆసరా పింఛన్లు మంజూరు కాగా అందులో ముథోల్ నియోజకవర్గంలో 8 వేల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. సర్పంచ్ ముజిగే ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఎంపీటీసీ లింగాదాస్, ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, జడ్పీ వైస్ చైర్మన్ బాశెట్టి రాజన్న, ఉప సర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, ఎంపీడీవో మోహన్రెడ్డి, ఎంపీవో రహీం, నాయకులు డా.శ్రీనివాస్, గోపు శివకుమార్, గైని సాయి, గంగాధర్, పండరి పాల్గొన్నారు.
స్వాతంత్రోద్యమ ఖ్యాతిని చాటాలి
స్వాతంత్రోద్యమ ఖ్యాతిని అందరికీ చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఏరియా దవాఖానలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, రూరల్ సీఐ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పీ.కృష్ణ, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డా.కాశీనాథ్, ఎస్ఐలు శ్రీనివాస్, విక్రమ్ పాల్గొన్నారు.
కుల సంఘాల అభివృద్ధికి కృషి..
కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. అంబకంటి గ్రామంలో రూ.11లక్షలతో నిర్మించిన గంగపుత్ర సంఘ భవనాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. గాజ సవిత అనే మహిళా రైతు కుటుంబానికి మంజూరైన రైతు బీమా చెక్కును అందజేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం మండల నాయకులు, ఆసరా పింఛన్ లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అర్హులకు మంజూరైన పింఛన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, శ్యాంసుందర్ పాల్గొన్నారు.