ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 28 : జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో అన్ని రకాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో మంగళవారం జిల్లా జడ్జి బీఎస్ జగ్జీవన్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యలను చైర్మన్కు జడ్జి వివరించారు. ఇందుకు స్పందించిన చైర్మన్ కోర్టు ప్రాంగణంలోని ఇంటర్నల్ రోడ్లు, కోర్టుకు వచ్చిన కక్షిదారులు, ఉద్యోగులకు అవసరమైన సులబ్కాంప్లెక్స్, ప్రహరీగోడను నిర్మిస్తామన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, హరితహారం కింద మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, కౌన్సిలర్ వెంకన్న, అడ్వకేట్లు రమణారెడ్డి, మేకల మధూకర్, పీపీ కేమ శ్రీకాంత్, ఏవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.