పటాన్చెరు టౌన్, జూన్ 20 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పెన్నార్ పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం 465 ఓట్లకు గాను 460 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్కు 253 ఓట్లు రాగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములుకు 207 ఓట్లు వచ్చాయి. 46 ఓట్ల మెజారిటీతో రాంబాబు గెలుపొందా రు. వరుసగా మూడుసార్లు బీఆర్టీయూను గెలిపించిన ప్రతి కార్మికునికి రుణపడి ఉంటామని రాంబాబు యాద వ్, బీఆర్ఎస్ సీనియర్ నేత గూడెం మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నాయకత్వంలో ప్రతి కార్మికుని సంక్షేమానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.