సమాజంలో పాతుకుపోయిన తీవ్ర లింగ వివక్షను దాటుకుని ఇప్పుడిప్పుడే చదువులు, ఉద్యోగాల బాట పడుతున్నారు మహిళలు. తమకంటూ ఒక గుర్తింపునూ తెచ్చుకుంటున్నారు. అయితే కార్యాలయాల్లో, కార్ఖానాల్లో ఆమెకు ఇక్కట్లు తప్పడం లేదు. పై అధికారులో, పక్కన కూర్చుని పని చేసేవారో… ఎవరో ఒకరు లైంగిక, మానసిక వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి కంప్లయ్కరో.కామ్ అనే సంస్థ ఓ సమగ్ర విశ్లేషణను ప్రచురించింది.
భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ వెబ్సైట్లో.. ఏ మహిళ అయినా కార్యాలయ వేధింపుల గురించి ఫిర్యాదు చేయవచ్చు. గత మూడు సంవత్సరాల్లో అందిన ఫిర్యాదుల ఆధారంగా.. ఏటికేడూ లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నట్లు ఈ సంస్థ విశ్లేషించింది.