Carbohydrates | ఆరోగ్యంపై అందరికీ దృష్టి పెరిగింది. కరోనా తర్వాత చాలామంది మరింత శ్రద్ధగా ఆహార నియమాలు పాటిస్తున్నారు. అయితే, పిండి పదార్థాలు శరీరానికి చాలా అవసరం. కానీ, అతిగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. పిండిపదార్థాల మోతాదు ఎక్కువైనప్పుడు శరీరం పంపే సంకేతాలను పరిశీలించాలని చెబుతున్నారు. వాటిని అలక్ష్యం చేస్తే సమస్యే అని హెచ్చరిస్తున్నారు.
♦ శరీరంలో పిండిపదార్థాలు అదనంగా వచ్చి చేరుతుంటే మొదట బరువు పెరుగుతూ ఉంటారు. దీనిని వెంటనే గుర్తించాలి. లేకపోతే ఊబకాయం సమస్య ఎదుర్కోవాల్సి రావచ్చు.
♦ పిండిపదార్థాలు అధికంగా తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల అధిక రక్తపోటు వచ్చి ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది.
♦ కార్బోహైడ్రేట్లు పెరుగుతున్న కొద్దీ సీరం ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల శరీరంలో ప్రతికూల ప్రభావాలు మొదలవుతాయి. కాలేయంలో ఎక్కువగా ఇన్సులిన్ తయారవుతుంది. చర్మ సంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. ఇలాంటప్పుడు పిండి పదార్థాలకు దూరంగా ఉండటం మేలు.
♦ మీకు తీపి పదార్థాలు తినాలనే కోరిక విపరీతంగా ఉంటే.. శరీరంలో కార్బోహైడ్రేట్లస్థాయి పెరిగిందని గ్రహించాలి. తీపి ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉంది.
♦ జీర్ణవ్యవస్థ గాడి తప్పితే మలబద్ధకం, కడుపు ఉబ్బరం మొదలవుతాయి. ఇలాంటి మార్పులను గమనించకుండా పిండిపదార్థాలు తినడాన్ని
నియంత్రించకపోతే జీర్ణక్రియ దెబ్బతిని ఎసిడిటీ, పేగు క్యాన్సర్ వంటి రుగ్మతలు తలెత్తుతాయి.
♦ శరీరంలో కార్బోహైడ్రేట్ల స్థాయి పెరిగినప్పుడు తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలను ఎంచుకోవాలి.
మీ జుట్టు ఒత్తుగా బలంగా అవ్వాలా? అయితే వీటిని తినండి !!
మీ శరీరం ఇచ్చే ఈ మిస్డ్ కాల్స్ నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు !!
జాగ్రత్త పడకపోతే 2030 నాటికి పిల్లల్లో ఈ ముప్పు తప్పదు!!
వేసవిలో వచ్చే గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!