భారత సంతతి మహిళ ప్రొఫెసర్ నీలి బెండపూడి చరిత్ర సృష్టించారు. అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి తొలి మహిళ, తొలి శ్వేతజాతీయేతర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. విశాఖపట్నంలో జన్మించిన నీలి ఉన్నత విద్యకోసం 1986లో అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం కెంటకీలో యూనివర్సిటీ ఆఫ్ లూయిస్విల్లే అధ్యక్షురాలిగా, మార్కెటింగ్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ 19వ అధ్యక్షురాలిగా నీలి బెండపూడి పేరును పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏకగ్రీవంగా ప్రకటించింది. 2022లో ఆమె పదవీకాలం ప్రారంభమవుతుంది. మార్కెటింగ్, వినియోగదారుల మనస్తత్వానికి సంబంధించిన అంశాల్లో నీలి బెండపూడి నిపుణురాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి నీలి ఎంబీఏ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆమె భర్త డాక్టర్ వెంకట్ బెండపూడి వివిధ విశ్వవిద్యాలయాల్లోప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు.