రాత్రికి రాత్రే ఎవరూ సెలబ్రిటీలు అయిపోరు. దానివెనుక కొన్నేండ్ల శ్రమ ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. పస్తులున్న పూటలు కోకొల్లలు. అయినా, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్నవారే స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. వారిలో ఒకరు ఇండియన్ స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్. ఆమె జీవితకథ ఆధారంగా రచయిత సందీప్ మిశ్రా రాసిన ‘ఫియర్స్లీ ఫిమేల్’ పుస్తకం హాట్కేకుల్లా అమ్ముడవుతున్నది. స్ప్రింటర్ ద్యుతీచంద్ది ఓ విభిన్నగాథ. పేదరికానికి దూరంగా వెళ్లిపోవాలన్న కసితో చిన్నప్పటినుంచే కొండల్లో పరుగెత్తేది. క్రీడాకారిణిగానూ ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, చుట్టూ ఏవో వివాదాలు. ప్రతీ మలుపునూ కండ్లకు కట్టినట్టు రాశారు రచయిత. ద్యుతీచంద్ అభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకమిది. ధర రూ. 399 మాత్రమే.