కావలసిన పదార్థాలు
జొన్నలు: ఒక కప్పు, మినుప పప్పు: పావు కప్పు, మెంతులు: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, వంటసోడా: చిటికెడు, నూనె: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా జొన్నలు, మినుప పప్పు, మెంతులు బాగా కడిగి, నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన జొన్నలను మెత్తగా రుబ్బుకొని పిండిని మరో మూడు గంటలపాటు నాననివ్వాలి. ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పు, చిటికెడు వంటసోడా వేసి బాగా కలిపి ఇడ్లీ రేకులకు నూనె రాసుకుని, ఇడ్లీలు వేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీ సిద్ధం. పల్లీలు, టమాట, అల్లం చట్నీతో బాగుంటాయి.