పచ్చి బొప్పాయి ముక్కలు: ఒక కప్పు, పచ్చిమిర్చి: ఆరు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, జీలకర్ర: ఒక టీస్పూన్, ఆవాలు: అర టీస్పూన్, కరివేపాకు: ఒక రెబ్బ, చింతపండు గుజ్జు: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి: రెండు, కొత్తిమీర తురుము: పావుకప్పు.
తయారీ విధానం
స్టవ్మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వెయ్యాలి. బాగా వేడయ్యాక బొప్పాయి ముక్కలు జోడించి సన్నని మంటపై దోరగా వేయించాలి. పచ్చిమిర్చి కూడా వేయించాలి. వేయించిన బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు, చింతపండు గుజ్జు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్మీద పాన్పెట్టి, కొద్దిగా నూనెవేసి, వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగిన పోపులో బొప్పాయి మిశ్రమం కలిపితే పచ్చడి సిద్ధం.