కావలసిన పదార్థాలు
ఉడికించిన నూడుల్స్: అరకప్పు, ఉడికించిన ఆలుగడ్డలు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కారం: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, కొత్తిమీర తరుగు: కొద్దిగా.
తయారీ విధానం
ఒక గిన్నెలో ఉడికించిన ఆలూ, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఉడికించి నీళ్లు వంపిపెట్టుకున్న నూడుల్స్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలూ ఉండల చుట్టూ నూడుల్స్ పట్టేలా అద్దాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక చేసిపెట్టుకున్న ఉండల్ని వేయాలి. సన్నని మంటపై దోరగా కాల్చుకుంటే నోరూరించే వేడివేడి నూడుల్స్ బాంబ్ సిద్ధం. టమాట కెచప్తో తింటే బాగుంటాయి.