కావలసిన పదార్థాలు
సేమ్యా: ఒక కప్పు, పాలు: నాలుగు కప్పులు, నెయ్యి: పావు కప్పు, చక్కెర: ఒక కప్పు, బాదం, జీడిపప్పు, కిస్మిస్: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం
స్టవ్మీద నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సేమ్యాను కూడా దోరగా వేయించి పెట్టుకోవాలి. స్టవ్మీద మరో గిన్నె పెట్టి, పాలుపోసి వేడి చేయాలి. పాలు మరుగుతుంటే వేయించిన సేమ్యా, చక్కెర, యాలకుల పొడి వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి. చివరగా.. వేయించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపితే నివేదనకు పాయసం సిద్ధం.