ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయటి ఉష్ణోగ్రతలకు తోడు ఒంట్లో కూడా వేడి పెరిగిపోతుంది. ఈ సీజన్లో చాలామంది అజీర్ణం, ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, కడుపులో మంట, అలసట, చెమటకాయలు
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయటి ఉష్ణోగ్రతలకు తోడు ఒంట్లో కూడా వేడి పెరిగిపోతుంది. ఈ సీజన్లో చాలామంది అజీర్ణం, ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, కడుపులో మంట, అలసట, చెమటకాయలు, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడతారు. ముఖ్యంగా తినే తిండిపై శ్రద్ధ అవసరం.
జంక్ ఫుడ్కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. నూనె పదార్థాలు అస్సలు తినకూడదు.
టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండాలి. వీటివల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. ఐస్ కాఫీ, గ్రీన్ టీ వరకూ ఫర్వాలేదు. మద్యం కూడా తీవ్ర హాని చేస్తుంది.
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలుచేసేవే అయినా.. ఎండాకాలం కాస్త తగ్గిస్తే మంచిది. ఎండు ద్రాక్ష, ఎండు అత్తిపండు, బాదం పప్పు కొంతమేర శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.
వంటల్లో దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాల వాడకాన్ని తగ్గించాలి. ఇవి కూడా వేడిని పెంచుతాయి.
వేసవిలో చాలామంది మామిడి కాయలను ఇష్టంగా తింటారు. తిన్నా మితంగా తింటేనే మంచిది. వీటివల్ల ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలూ రావచ్చు.