ఈ తరానికి పోస్ట్కార్డుల గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. క్రమంగా మన జీవితాల్లోంచి కనుమరుగైపోయాయి కూడా. కానీ, వాటిని మరో రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.. ‘డాక్ వాక్’. దీన్ని ఒనైజా డ్రాబు, ప్రాచీ ఝా అనే స్నేహితురాళ్లు ప్రారంభించారు. వీరిది జంషెడ్పూర్. ఇద్దరికీ పుస్తక పఠనంపై అపారమైన ప్రేమ. ఏండ్ల కిందట ఓ వెలుగు వెలిగిన రచయితల గ్రంథాలను వీరు సేకరిస్తున్నారు. ‘మేమిద్దరం దక్షిణాసియా రచయితల సమగ్ర సాహిత్యాన్ని చదివాం. న్యూస్లెటర్ల రూపంలో మేం చదివిన వాటిని పాఠకులకు తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాం’ అంటున్నారు ఆ ఇద్దరూ. ఇలా, పోస్ట్కార్డ్ల ద్వారా ఉత్తమ గ్రంథాల సారం వేల మందికి చేరుతున్నది. పరోక్షంగా పోస్ట్ కార్డులకూ ఆదరణ పెరుగుతున్నది.