కావలసిన పదార్థాలు
బియ్యం: రెండు కప్పులు, పచ్చికొబ్బరి: అర కప్పు, బెల్లం: ఒకటిన్నర కప్పు, నువ్వులు: పావు కప్పు, వంటసోడా: అర టీస్పూన్, యాలకుల పొడి: ఒక టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నాన బెట్టాలి. నీళ్లు వంపిన బియ్యాన్ని ఆరబెట్టి పిండి పట్టుకుని జల్లించాలి. మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకం పట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెను దింపి యాలకుల పొడి, వంటసోడా, నువ్వులు, పచ్చికొబ్బరి వేసి కొద్దికొద్దిగా పిండి వేస్తూ బాగా కలపాలి. పిండి ఆరిపోకుండా మూతపెట్టి కొద్దికొద్దిగా తీసుకుంటూ బూరెలు ఒత్తుకోవాలి. వాటిని వేడివేడి నూనెలో కాల్చుకుంటే నోరూరించే కొబ్బరి బూరెలు సిద్ధం.