R.M. Vishakha | మహిళలు ఉన్నత స్థానాల్లో ఉండటం, ఆయా బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించడం కత్తిమీద సామే. అందులోనూ సీయీవో లాంటి అత్యున్నత స్థానాల్లో ఉండేవారి పరిస్థితి ఇంకా కష్టం. కానీ, తాను బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే ఆ సంస్థ ర్యాంక్ను 21 నుంచి 11వ స్థానానికి తీసుకొచ్చారు ఆర్.ఎం.విశాఖ. గత ఏడేండ్లుగా ‘ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ( India first Life Insurance )’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీయీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారామె. ‘ఓ బాస్గా నా మానసిక పరిస్థితి అందరి పనుల మీదా ప్రభావం చూపుతుంది. అందుకే నేనెప్పుడూ ప్రశాంతంగా, చురుగ్గా ఉండటానికే ప్రయత్నిస్తా. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు ధర్మ-కర్మ సిద్ధాంతాల్ని అనుసరిస్తా. కొన్నిసార్లు నేను తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగతంగా నాకు నచ్చకపోవచ్చు. కానీ, ఆ స్థానంలో ఉన్నందువల్ల నేను సంస్థకు మేలు చేసే నిర్ణయమే తీసుకోవాలి. నేను నిత్యం భగవద్గీత చదువుతా, అందులోని కర్మ సిద్ధాంతాన్ని ఆచరిస్తా. అదే నా రూల్బుక్’ అంటున్నారు విశాఖ.
కిక్ కోసం ఐఏఎస్ వదిలి.. అడవుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు”