మామిడి పండు: ఒకటి, పాలు: ఒక కప్పు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, సేమియా: పావు కప్పు, సబ్జా గింజలు: ఒక టీస్పూన్, మ్యాంగో జామ్: ఒక టేబుల్ స్పూన్, ఐస్క్రీం: ఒక కప్పు.
మామిడి పండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. పాలను కాచి చల్లార్చి ఫ్రిజ్లో పెట్టాలి. సేమియాను కొద్దిగా వేయించి, నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికాక నీళ్లు వంపేసి చల్లార్చుకోవాలి. సబ్జా గింజల్లో నీళ్లుపోసి పది నిమిషాలపాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో సబ్జా గింజలు, సేమియా, చక్కెర, మామిడి పండు గుజ్జు వేసి పాలు పోసి ఒకసారి కలపాలి. పైనుంచి మ్యాంగో జామ్, ఐస్క్రీమ్ వేసుకుంటే చల్లచల్లగా నోరూరించే మ్యాంగో ఫాలూదా సిద్ధం.