వానకాలం వచ్చిందంటే.. చన్నీళ్లు తాకాలంటేనే ఒళ్ల్లు జలదరిస్తుంది. దంతధావనం మొదలు స్నానం వరకు వేడినీళ్లకు అలవాటుపడతాం. గోరువెచ్చని నీళ్లయితే ఫర్వాలేదు కానీ, పొగలు కక్కే వేడినీళ్లతో ముఖం కడుక్కుంటే ఇబ్బందులు
వానకాలం వచ్చిందంటే.. చన్నీళ్లు తాకాలంటేనే ఒళ్ల్లు జలదరిస్తుంది. దంతధావనం మొదలు స్నానం వరకు వేడినీళ్లకు అలవాటుపడతాం. గోరువెచ్చని నీళ్లయితే ఫర్వాలేదు కానీ, పొగలు కక్కే వేడినీళ్లతో ముఖం కడుక్కుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.
కాలానికి తగ్గట్టుగా అలవాట్లు మారుతూ ఉంటాయి. కానీ, సౌందర్య సాధనలో కొన్ని షరతులు అన్ని కాలాలకూ వర్తిస్తాయి. వేడినీళ్ల వాడకమూ అలాంటిదే. గది ఉష్ణోగ్రతకు కాస్త అటూ ఇటుగా ఉన్న నీటితో ముఖం కడుక్కోవడమే మంచిదని సూచిస్తున్నారు డెర్మటాలజిస్టులు.
చర్మంపై ఉండే పైపొర రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. దుమ్ము, ధూళి ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. వేడినీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల ఈ పొర దెబ్బతినవచ్చు. ఫలితంగా సహజ రక్షణ లక్షణం తగ్గుతుంది. దుమ్ము, ధూళి ప్రభావం చర్మ కణాలపై అతిగా పడుతుంది. పైగా మచ్చలు ఏర్పడే ప్రమాదమూ ఉంది.
వేడినీళ్ల వాడకం వల్ల చర్మంపై ఉండే మెలనోసైట్స్ కణాలు ఉత్తేజితం అవుతాయి. దీనివల్ల చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడవచ్చు. చర్మగ్రంథులు స్రవించే నూనెలూ తగ్గుతాయి. ఇది ఇలాగే కొనసాగితే చర్మం రంగు వివర్ణం కావొచ్చు. ఈ సమస్యలేం లేకుండా, బయట వాతావరణం ఎలా ఉన్నా, మసిలే వేడినీళ్ల జోలికి వెళ్లకుండా, ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలని సూచిస్తున్నారు.