కరోనా మొదలైనప్పటి నుంచీ రకరకాల శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కొందరైతే ఇంట్లోనే తయారు చేసుకోవడమూ చూశాం. త్వరలోనే, ఎసెన్షియల్ ఆయిల్తో చేసిన పరిమళ భరిత శానిటైజర్లూ రానున్నాయి. రూపాల్ షబ్నం అనే అరోమా థెరపిస్ట్ ఆలోచన ఇది. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)తో కలిసి తయారు చేయనున్నారామె. విదేశాల్లో చదువుకొన్న రూపాల్ అరోమా థెరపీ ప్రాధాన్యాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. దేశంలోనే తొలిసారిగా న్యూఢిల్లీలో అరోమా థెరపీ క్లినిక్ను స్థాపించారు. కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు, మైగ్రెయిన్ మొదలైన సమస్యలను తగ్గించడంలో అరోమా థెరపీని ఉపయోగించారు. ‘ఎసెన్షియల్ ఆయిల్తో చేసే హ్యాండ్ శానిటైజర్లు చర్మానికి ఏమాత్రం హాని చేయవు. పైగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నా ఆలోచన డీఆర్డీఓ అధికారులకూ నచ్చింది’ అని చెబుతారు రూపాల్ షబ్నం.