బిస్కెట్లు తింటాం. చిప్స్ నమిలేస్తాం. చాక్లెట్లు చప్పరిస్తాం. కొంతసేపటికి అన్నీ పొట్టను చేరుకుంటాయి. వాటితోపాటు వచ్చిన కవర్లు చెత్తను చేరుకుంటాయి. అదంతా మట్టిలో కలిసిపోవాలంటే.. వందలు, వేల సంవత్సరాలు పడుతుంది. అప్పటివరకూ అలానే వదిలేస్తే.. భూగోళానికి ఊపిరాడదు. అందుకే, ఆ వ్యర్థాలను రీసైకిల్ చేసి భవన నిర్మాణంలో ఉపయోగపడే షీట్స్గా తయారు చేస్తున్నారు గుజరాత్కు చెందిన రాధికా చౌదరి. దీన్ని ైప్లెవుడ్కు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ధర కూడా తక్కువే. ‘మేం రీసైకిల్ చేసే ప్రతి టన్ను వ్యర్థాలూ..
నాలుగు టన్నుల కార్బన్ ఉద్గారాలను ప్రకృతిలో కలిసిపోకుండా అడ్డుకుంటాయి’ అంటారు రాధిక. గుజరాత్లోని అంక్లేశ్వర్ కేంద్రంగా ‘రిక్రాన్ ప్యానెల్స్’ను స్థాపించారామె. సంప్రదాయ వ్యాపార కుటుంబం నుంచి వచ్చినా, ఎంబీయే తర్వాత తనదైన దారి ఎంచుకున్నారు. పెట్టుబడి కోసం కుటుంబంపై ఆధారపడకుండా వెంచర్ క్యాపిటల్ సంస్థల సాయం తీసుకున్నారు. తన కంపెనీ ఉత్పత్తులను అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ‘నా దృష్టిలో వ్యాపారం ఓ సామాజిక బాధ్యత. ఓ తీవ్ర సమస్యకు పరిష్కారం. మనల్ని మనం నిరూపించుకునే అవకాశం కూడా’ అంటారు రాధిక.