మహారాష్ట్రలోని పర్భణి జిల్లా పాలన మొత్తం మహిళల చేతుల్లోకి వచ్చేసింది. ఇక్కడ అన్ని కీలక స్థానాల్లో మగువలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా రాగసుధను నియమించడంతో మార్పు పరిపూర్ణమైంది. రాజ్యసభ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే కూడా మహిళలే. జిల్లా కలెక్టర్ హోదాలో ఆంచల్ గోయల్ ఇప్పటికే అక్రమార్కుల తాట తీస్తున్నారు. ఈ నెలలోనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఉన్న రష్మీ ఖండేకర్ను జడ్పీ సీయీవోగా నియమించారు.
పర్భణి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తృప్తి సంద్భోర్ వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ తొలివారంలో ఉజ్వల నందీశ్వర్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రాంతీయ రవాణా కార్యాలయానికి అశ్విని స్వామి నేతృత్వం వహిస్తున్నారు. లేడీ బాసుల ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలైంది. సమస్యలేవైనా ఉంటే.. మహిళలు నేరుగా సర్కారీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.