చర్లపల్లి, జూన్ 18 : ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ వద్ద నాలాపై నిర్మించిన రోడ్డును జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కాలనీలో పర్యటించి నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లే దారి కావడంతో కాలనీవాసులు సహకరిస్తే నిధులు సమకూర్చి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రోడ్డు సమస్యను పరిష్కరించే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. నాలాలోని నీరు సాఫీగా వెళ్లేందుకు వ్యర్థాలు, చెత్తను తొలగించి నాలా పూడికతీత పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బేతాల బాల్రాజు, నాయకులు కాసం మహిపాల్రెడ్డి, మణిపాల్రెడ్డి, ఏనుగు సీతారామిరెడ్డి, సురేందర్రావు, శ్రీనివాస్రెడ్డి, కుమారస్వామి, ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియెషన్ అధ్యక్షుడు అశోక్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.