పేదలు ఆకలితో అలమటించొద్దు
మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్రెడ్డి
నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్రాలు షురూ..
ఉప్పల్/మల్లాపూర్, మే 13 : నాచారంలోని పారిశ్రామిక ప్రాంతం సమీపంలో హరేరామ హరేకృష్ణ పౌండేషన్, జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో అన్నపూర్ణ రూ.5 భోజన కేంద్రం గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లాక్డౌన్, కరోనా నేపథ్యంలో గ్రేటర్లో మరిన్ని రూ.5ల భోజన కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, పన్నాల దేవేందర్రెడ్డి, కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్, ఏఎంహెచ్వో మైత్రేయి, ప్రాజెక్టు ఆఫీసర్ ఇందిర, పార్టీ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, కట్ట బుచ్చన్న, అంజి, తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి: లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం కుషాయిగూడ, రైల్ విహార్ కాలనీ వద్ద హరే రామ హరే కృష్ణ, జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లను డిప్యూటీ కమిషనర్ శంకర్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభు త్వం ప్రకటించిన లాక్డౌన్లో పేదలు, వలస కార్మికులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలో కరోనా వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామరి చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్లను ధరించి భౌతిక దూరం పాటించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట, హెచ్బీకాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, ఏఈ సత్యలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, భానుచందర్, శ్రీకాంత్యాదవ్, నర్సింహాచారి, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్: కరోనా బారినపడి ఐసొలేషన్లో ఉన్నవారికి ఉచితంగా భోజనం అందజేస్తున్నాని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు అన్నారు. రామంతాపూర్లో గురువారం పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కుమారస్వామి, నారాయణదాస్, శైలేందర్, సంతోష్గుప్తా, ప్రభాకర్రెడ్డి, బాలకృష్ణ, మాణిక్యం, కామేశ్, శ్రీనివాస్, దేవా, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.