యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న (ఎన్డీయే) నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని, అందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. కొవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, అందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై అధికారులకు శనివారం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, హైదరాబాద్లో మొత్తంగా 15 సెంటర్లను ఏర్పాటు చేయగా, 6,329 మంది పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఒక సెషన్గా పరీక్షలు కొనసాగనున్నాయని తెలిపారు. మాస్కులను ధరించాలని, శానిటైజర్లను వెంట తెచ్చుకోవాలని తెలిపారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో యూపీఎస్సీ ఇన్స్పెక్ష్షన్ ఆఫీసర్ పృథ్వీసింగ్, లోకల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.