యాదాద్రి భువనగిరి, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతి నిధి): నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తేల్చేందుకు అధికార యంత్రాంగం నల్ల గొండలోని పౌరసరఫరాల గోదాం ప్రాంగణంలో కౌంటిం గ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్నది. ఎ మ్మెల్సీ నియోజక వర్గంలోని 12 జిల్లాల నుంచి ఇక్కడకు తరలించిన బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పట్టభద్రులు ఓటింగ్లో పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 38,367 మంది పట్టభద్రుల ఓట్లు ఉం డగా.. 31,162 మంది(81.22 శాతం) తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియగా.. కౌంటింగ్ ప్రక్రియను సైతం ప్రశాంతంగా పూర్తి చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల బరిలో 71 మంది అభ్యర్థులు ఉండగా.. బుధవారం ప్రారంభమయ్యే కౌంటింగ్లో వీరు తమ అదృష్టాన్ని పరీ క్షించుకుంటున్నారు. స్ట్రాంగ్ రూముల్లో వీరి భవిష్యత్ భ ద్రంగా ఉండగా..కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై తొలి ఫలి తం వెలువడ్డాక గెలుపు.. ఓటములపై ఓ స్పష్టత రానున్న ది. అయితే గత రెండు రోజులుగా అభ్యర్థులతో పాటు వివి ధ రాజకీయ పార్టీల నేతలు ఎవరి లెక్కల్లో వారు తలమున కలై ఉన్నారు. ఎక్కడ ముందున్నాం..ఎక్కడ వెనుకబడ్డామ నే చర్చలతో పాటు సమాలోచనలు, సమీక్షలు జరిపి అంద రూ బిజీబిజీగా గడిపారు. సన్నిహితులు, బంధువులు, స్నే హితులు,పార్టీ అభిమానులు, కార్యకర్తలతో వివరాలు ఆరా తీస్తున్నారు. ఎవరికి వారు తాము గెలుస్తామని పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల మాత్రం గుబులు పట్టుకున్నది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ సవాల్గా తీసుకుని కార్యాచ రణను రూపొందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలపై పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు నడిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గులాబీ శ్రేణు లు అభ్యర్థి పల్లా గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. మంత్రి మొదలుకుని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. సర్పం చ్ల నుంచి అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పట్టభద్రుల ఓటు నమోదు దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల వరకు వారిని రప్పించే వరకు చెమటోడ్చి కష్టపడ్డారు. దీంతో గణనీయంగా పోలింగ్ శా తం పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపుస్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్న ధీమాను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని 12 జిల్లాల్లో పోలైన ఓట్ల న్నింటినీ నల్లగొండలోనే లెక్కిస్తుండటంతో కౌంటింగ్ ముగి యడానికి సుధీర్ఘ సమయం పట్టనున్నది. 12 గంటలకో షిప్టు లెక్కన నాలుగు షిప్టుల్లో వెయ్యిమంది చొప్పున పని చేసి ఓట్ల లెక్కింపును జరుపనున్నారు. ఒక్కో హాళ్లో 7 టేబు ల్స్ లెక్కన 56 టేబుళ్లను ఏర్పాటు చేసి 731 పోలింగ్ కేం ద్రాల నుంచి వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. 25 బ్యాలెట్ పత్రా లకు ఒకటి చొప్పున కట్టలు కట్టి లెక్కించనుండడంతో తొలి ఫలితం 10 గంటల తర్వాతే వెలువడుతుందని అధికారు లు పేర్కొంటున్నారు. గురువారం ఉదయం వరకల్లా ఎవ రు గెలుపుకు దగ్గరగా ఉన్నారన్నదానిపై స్పష్టత రానుంది. బుధవారం ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులు కొనసాగనుండగా.. కౌంటింగ్ ప్రక్రియను సజావు గా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సైతం తరలి వెళ్లింది.