ఆత్మకూరు(ఎం) : ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాల ని జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఇటీవల నిర్మించిన ప్రహారిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందివ్వడంతో పాటు ఆరోగ్య కేంద్రం ఆవరణ చుట్టు పూల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఆయన వెంట పంచాయతీ రాజ్ డీఏ హేమంత్కుమార్, ఎంపీడీవో ఆవుల రాములు, సర్పంచ్ నగేష్, పీఆర్ఏఈ సుధాకర్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.