రాజన్న సిరిసిల్ల : ఎండుగడ్డిని తీసుకువెళ్తున్న ఓ ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ తగలడంతో అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కోత్తూర్లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. రైతు రాగటి శంకర్ తన వ్యవసాయ క్షేత్రం నుండి ఎడ్డిగడ్డిని తన నివాసానికి తరలిస్తున్నాడు. సంఘటన జరిగినప్పుడు శంకర్ గ్రామ పంచాయతీ అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బందిని అలెర్ట్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేసి మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది.