హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినియోగంలో లేని వస్తువులకు 5S నిర్వహణలో భాగంగా బుధవారం అంబర్పేట్లోని కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో వేలం వేశారు.
సర్వీస్లో లేని కంప్యూటర్లు, ప్రింటర్లు, సీపీయూలు, కిట్ ఆర్టికల్స్, పాతబడిన టెంట్లు, ఇనుప సామగ్రి, స్టోర్ వసువులను విక్రయించేందుకు వేలం నిర్వహించారు. వేలం ద్వారా రూ. 3 లక్షల 10 వేలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నారు.
వేలం నిర్వహణ కమిటీ సభ్యులు రాచకొండ పోలీస్ డీసీపీ శిల్పవల్లి, అడిషనల్ డీసీపీ సమీర్, లక్ష్మీనారాయణ, సైబర్ క్రైమ్ ఏసీపీ హరిబాబు, ఏసీపీ నాగేంద్రుడు, ఆర్ఐ అడ్మిన్ దిలీప్ కుమార్, స్టోర్ సూపరిoటెండెంట్ సమక్షంలో వేలం జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన 60 మందికి పైగా కొనుగోలుదారులు వేలంలో పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి