ములుగు, మార్చి 12(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. ములుగు నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీని నిలబెట్టాలన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కే లక్ష్మీనర్సింహారావు అధ్యక్షతన ము లుగు, వెంకటాపూర్ మండలాల పార్టీ నాయకులతో పా ర్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా పార్టీ గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలు, గ్రామాల్లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అన్ని విషయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పదేళ్లలో ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. గిరిజన యూనివర్సిటీని ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేసేందు కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింద గుర్తుచేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించాలని సూచించారు. గ్రూప్ రాజకీయాలు పక్కనపెట్టి అందరూ సహకరించాలని ఈ సందర్భం గా ఎంపీ కవిత కోరారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోవింద్నాయక్, బీఆర్ఎస్ నాయకులు లింగాల రమణారెడ్డి, గై అశోక్, భూక్యా మురళి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయ్రామ్ నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.