కొత్తగూడ, నవంబర్ 7: ములుగు ఎమ్మెల్యేగా సీతక్క రెండు పర్యాయాలు గెలిచి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రశ్నించారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, పెగడపల్లి, లడాయిగడ్డ, రామన్నగూడెం, ముస్మీ, చెరువుముందు తండా, వేలుబెల్లి, పోలారం, బత్తులపల్లి, గోపాలపురం గ్రామాల్లో నాగజ్యోతి ప్రచారం చేయగా వేలుబెల్లిలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో ఆమె మాట్లాడుతూ ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలు చెప్తున్నారని ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిందన్నారు. పోడు రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. పింఛన్లు సైతం పెంచి ఇసున్నట్లు వివరించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్వో ఎఫ్ఆర్ చట్టాన్ని తెచ్చి పోడు చేసుకుంటున్న రైతులు మూడు తరాల నుంచి ఆధారాలు తెమ్మంటే ఎలా తెస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారన్నారు. అలాంటి వారికి పట్టం కడితే మరో 50 ఏండ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందన్నారు.
ఎన్నో ఏండ్లుగా గిరిజనులతో మమేకమై జీవిస్తున్న గిరిజనేతరులకు సైతం పోడు భూములపై హక్కులు కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో విడుదల చేశారని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. వేలుబెల్లి ప్రచారంలో మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం ఏజెన్సీలో రైతులకు పాకాల నీటిని అందించి సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. నాగజ్యోతిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రచారంలో ఓడీసీఎం వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు, కంది అనీల్రెడ్డి, బానోత్ నెహ్రు, సర్పంచులు, ఎంపీటీసీలు, సంతోషరాణి, రమేశ్ పాల్గొన్నారు. కాగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.