Hanamakonda | హనుమకొండ చౌరస్తా, మార్చి 27: 1984 లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని కబ్జా కోరల నుండి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు.
హనుమకొండ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూ బాధితుడు చిట్టి రెడ్డి రజనీకర్ రెడ్డి మాట్లాడారు. తాము దుగ్గంపూడి జోజి రెడ్డి దగ్గర 30 మందిని కలిసి కుమార్ పెళ్లి శివారులో సర్వేనెంబర్ 126, 117 లల్లో ఎకరం మూడు గంటల భూమి కొనుగోలు చేసి 2017లో భూమి కాస్తు చేయించామని తెలిపారు.
కానీ 2017లో మాపై దాడి చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి మీ భూమి 117 కాదు 126 అని చెప్పి తమ భూమి ఎక్కడ ఉందో చూసుకోమని తమపై రంజిత్ రెడ్డి తో పాటు 20 మంది దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి నుంచి తమను ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని వాపోయారు.
ఈ విషయం గతంలో కేయూసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే అక్కడ ఎక్కడ కూడా భూమి కాగితాలు తీసుకుని రాకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ రంజిత్ రెడ్డితో పాటు అతడి తల్లి, సోదరిని ముందు పెట్టి తమ భూమి లోకి తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమ భూమిని తమకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ, శ్రీలత, కొండయ్య, అనంతలక్ష్మి, మహేందర్, ధనలక్ష్మి, తనీషా, సురేష్, గణేష్, మాధవరెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు