హనుమకొండ, నవంబర్ 6 : గత ప్రభుత్వాలు గుడిసెవాసులను విస్మరించినప్పటికీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్వహించిన తెలంగాణ గుడిసెవాసుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో వినయ్ భాస్కర్ పాల్గొని మాట్లాడారు. తనకు గుడిసెవాసులతో అనుబంధం ఇప్పటిది కాదని, కొన్నేళ్ల నుంచి ఉందన్నారు. గుడిసె వాసుల సమస్యలపై గత ప్రభుత్వాలపై పోరాటం చేశానన్నారు. ఎల్లప్పుడూ వారికి వెన్నంటి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 50 ఏండ్లుగా తీరని గుడిసె వాసుల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. పట్టాలు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్దే అన్నారు. గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో మౌలిక సౌకర్యాలను కల్పించామన్నారు. తాను కార్పొరేటర్గా ఉన్నప్పుడు గుడిసె వాసుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేశానన్నారు. తన సోదరుడు ప్రణయ్ భాసర్ తర్వాత గుడిసెవాసులకు అండగా ఉన్నది తానేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని గుడిసెవాసుల పిల్లలు ఉన్నత విద్య చదవడానికి తన వంతు సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో, వరదలు వచ్చినప్పుడు నిత్యావసర వస్తువులను ఇచ్చినట్లు తెలిపారు. గుడిసె వాసులు ఏ కష్టంలో ఉన్నా వారికి అండగా ఉంటున్నానని తెలిపాఉ. కాగా, ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలకు చెందిన వంద మంది వాసులు బీఆర్ఎస్లో చేరగా వారిని కండువా కప్పి చీఫ్ విప్ ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ గుడిసెవాసుల సంఘం అధ్యక్షుడు కారు ఉపేందర్, గౌరవ సలహాదారు సిరబోయిన కరుణాకర్, ప్రధాన కార్యదర్శి బొట్ల కుమారస్వామి, కోశాధికారి ఎర్ర చంద్రమౌళి, ఉపాధ్యక్షులు ఏసబోయిన శ్రీనివాస్, సురేందర్, నాయకులు సమద్, వనమాల, రాజశేఖర్, బిక్షపతి, హస్సేన్బీ, శ్రీలత పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు మాల కుమ్మరి పరశురాములు సహకారంతో మాల కుమ్మరి శిరీ ష, సింధూజ నిర్మాణ సారథ్యంలో రవితేజ రచించి, ఇనుగుర్తి మధు పాడిన పాటను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస ర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిషరించారు. ఈ పాటకు హనుమకొండ భిక్షపతి సంగీతం అందించారు. ఈ పాట విన్న చీప్ విప్ చాలా బాగుందని అన్నారు. తన మీద ప్రేమతో పాట చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, కల్పలత సూపర్ మారెట్ వైస్చైర్మన్ షఫీ, బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, రాచర్ల జగన్, దీపు, శివకుమార్, అయేషా ఫాతిమా, బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, పొడిశెట్టి వాసు, వివేక్, మౌనిక పాల్గొన్నారు.
న్యూశాయంపేట : గ్రేటర్ 31వ డివిజన్కు చెందిన పలువురు కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ ఆధ్వర్యంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రితిక్, శ్రీకాంత్, రాజేశ్చారి, పిన్నింటి చందు, వినయ్, హేమంత్, శంకేసి చందు, శివ, సాయిచరణ్, సురేందర్, శివ, ముఖేశ్, ధన్రాజ్ పాల్గొన్నారు.