వర్ధన్నపేట, నవంబర్ 10: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల అవసరా లు, ఇబ్బందులను గుర్తించడంతో పాటు రాష్ట్ర ప్రగతి కోసం అవసరమయ్యేలా సంక్షేమ పథకాల కు రూపకల్పన చేసి పారదర్శకంగా అమలు చేస్తు న్నారని అన్నారు. పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని పూర్తిస్థాయిలో ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తూ దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్నాడని కొనియాడారు. గత ఎనిమిదేళ్లు గా సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు చేస్తున్నద ని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి ప్రజలు నిత్యం అండదండగా నిలుస్తున్నారని అన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మండల కేంద్రంలోని జామా మజీద్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్ గురువారం శంకుస్థాప న చేశారు. మజీద్ను అభివృద్ధి చేసి సమస్యలు పరిష్కరించాలని కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కోరడంతో ప్రభుత్వం నుంచి రూ. 8.35 లక్షలను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు మజీద్ పనులను దగ్గరుండి నాణ్యతగా చేయించుకోవాలన్నారు. వర్ధన్నపేట నియోజకవ ర్గ పరిధిలోని మజీద్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రూ.6 కోట్లను మంజూరు చేయించగా, ఇందులో వర్ధన్నపేట మండలానికి రూ. కోటీ 37 లక్షలు కేటాయించినట్లు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజే శ్కన్నా, కట్య్రాల సర్పంచ్ గుజ్జ సంపత్రెడ్డి, ము న్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి, రవీందర్, రామకృష్ణ, మైనార్టీ నాయకులు ఎండీ అన్వర్, రహీమొద్ద్దీన్ తదితరులు పాల్గొన్నారు.