గిర్మాజీపేట(ఖిలావరంగల్), నవంబర్ 7 : 2015 కంటే ముందు ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ విధిగా అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. ఆధార్ నవీకరణపై సోమవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాలు, స్థలాల రిజిస్ట్రేషన్లు, సిమ్-రేషన్కార్డులు, స్కాలర్షిప్ పొందేం దుకు ఆధార్కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందాలంటే అప్డేట్ చేసుకోవాలని.. ఈ విషయమై తగిన చర్యలు చేపట్టాలని జిల్లా మేనేజర్ ఏ రాజ్కుమార్ను ఆదేశించారు. అలాగే, కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో ప్రజల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించా రు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోట, డీఆర్డీఏ పీడీ సంపత్రావు, ఆర్డీవో మహేందర్జీ, సీపీవో జీవరత్నం నాయుడు పాల్గొన్నారు.