వరంగల్/కరీమాబాద్, అక్టోబర్ 2: ఆడబిడ్డలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనే సద్దుల బతుకమ్మకు జిల్లావ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం వరంగల్ 11వ డివిజన్ పరిధిలోని భద్రకాళీ ఆలయం ఎదురుగా పార్కింగ్ స్థలంలో బతుకమ్మల నిమజ్జనం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నీటి కొలనును మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని అధికారులకు సూచించారు. అనంతరం మేయర్ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ వెంట కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, ఈఈ, ఏఈ, టీఆర్ఎస్ నేత సురేందర్ ఉన్నారు. బెస్తం చెరువు వద్ద బతుకమ్మ ఆట స్థలాన్ని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పరిశీలించారు. ఆమె వెంట గుండు పూర్ణచందర్, దామెరకొండ కరుణాకర్, మండల నర్సింహరాములు ఉన్నారు. కాగా, ఉర్సు రంగలీల మైదానంలోని చెరువు, మెట్టు దర్వాజ వద్ద చెరువు, బెస్తం చెరువు సమీపంలో సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేశారు. చెరువులో గుర్రపుడెక్కను తొలగించారు.
పరిశీలించిన ప్రజాప్రతినిధులు
సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం పరిశీలించారు. వర్ధన్నపేట పట్టణానికి చెందిన మహిళలు రామచంద్రస్వామి ఆలయ పక్కన ఆకేరువాగు ఒడ్డున పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుకునేందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు.
నర్సంపేట మండలవ్యాప్తంగా ఆట స్థలాల్లో విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. నర్సంపేటలోని అంగడి స్థలం, వల్లభ్నగర్లో బతుకమ్మకు ఏర్పాట్లు చేశారు. హైమాస్ట్ లైట్లు బిగించారు. స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, సర్పంచ్లు పనులను పరిశీలించారు.