నర్సంపేట,సెప్టెంబర్19: అధికారులు ప్రజల అభిమానాన్ని పొందాలని, పని చేసిన చోట మంచి పేరు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట ఆర్డీఓ పవన్కుమార్కు సన్మాన సభ నిర్వహించారు. ఆయనకు ఇటీవల కరీంనగర్ జిల్లాకు బదిలీ కావడంతో సోమవారం ఇక్కడ రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పవన్కుమార్కు పూలమాల వేసి శాలువాను కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు ప్రజలు మెచ్చే విధంగా పనులు చేయాలని కోరారు. ప్రజలు చిరకాలం గుర్తించుకునేలా ఉండాలన్నారు. మంచి అధికారులను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ హరిసింగ్, ఏసీపీ సంపత్రావు, సీఐ పులిరమేశ్ గౌడ్, తహసీల్దార్ రామ్మూర్తి, తహసీల్దార్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభం
బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు నిరుద్యోగులకు వరంగా మారుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ను నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం గ్రూప్ 3, 4 ఇతర పోటీ పరీక్షలకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన బీసీ స్టడీ సర్కిల్ ఉపయోగపడుతుందన్నారు. ఇది నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఉచిత శిక్షణ తరగతులను గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్కు మొదటి విడుతగా రూ.5 లక్షలు విడుదలయ్యాయని తెలిపారు. దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
‘సుకన్య’ ఖాతా తెరవాలి
పోస్టాఫీసులో సుకన్య ఖాతాను తెరవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పోస్టాఫీసులో సుకన్య ఖాతాల ముగింపు కార్యక్రమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని సమావేశ గదిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడపిల్లలకు ఈ ఖాతాలను పోస్టాఫీసులో తెరవాలని కోరారు. సున్నా నుంచి పదేళ్లలోపు ఆడపిల్లలు ఈ సుకన్య ఖాతాను తెరవాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, గందె రజిత, ఏసీడీపీఓ విద్య, పోస్ట్ మాస్టర్ రమేశ్, సబ్పోస్ట్ మాస్టర్ దార్ల రాజేందర్, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.