మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుపై 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కాలయాపన చేసి ఇబ్బందిపెట్టిందని ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్ పెంపు పై విప్లవాత్మక నిర్ణయం తీసుకొని 10శాతం పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు. నిరుపేద ఆదివాసీ కుటుంబాల అభివృద్ధి కోసం గిరిజన బంధు ప్రకటించిన సీఎం కేసీఆర్కు గిరిజనులమంతా రుణపడి ఉంటామన్నారు. పోడు భూములకు సంబంధించిన సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, ఇప్పటికే ప్రతి జిల్లాకు కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సేవాలాల్, కుమ్రం భీం జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపా రు. రిజర్వేషన్లు పెంచి, గిరిజన బంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ గిరిజనులకు ఆరాధ్యదైవంగా మరారన్నారు. గిరిజన భవనాలు ప్రారంభం, రిజర్వేషన్ పెంపు, గిరిజన బంధు, పోడు భూములకు శాశ్వత పరిష్కారం వంటి కార్యక్రమాలు పక్కాగా అమలు చేస్తుండడంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. రాజధానిలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం శుభ పరిణామన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి గిరిజన రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అలా అడ్డుకుంటే గిరిజనులు నడిరోడ్డుపై వారిని ఉరి తీస్తారని హెచ్చరించారు. సోయం బాపురావు త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపురా వు మాటల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.
గిరిజనుల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర లు చేస్తున్నదని ఆరోపించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమనరీ రాత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఊసే లేద ని, గిరిజన యూనివర్సిటీ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీని ప్ర జలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. గిరిజనుల కోసం ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతూ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్కు జన్మంతా ఎంత చేసినా తక్కువేనని, తన చివరి రక్తబొట్టు వరకు కేసీఆర్ వెంటే నడుస్తానని తెలిపారు. గిరిజన రిజర్వేషన్ పెంపు, గిరిజన బంధు, గిరిజన భ వన ప్రారంభోత్సవాలు తాను గిరిజన మం త్రిగా ఉన్న సమయంలో జరుగడం అదృష్టంగా భావిస్తు న్నాను.
రాష్ట్రంలో ఉన్న గిరిజనులంతా సీఎం కేసీఆర్కు అండగా ఉండి దీవిస్తారని ఆశించారు. స మా వేశంలో జడ్పీ చైర్పర్సన్ బిందు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కురవిలో వీరభద్ర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ పేరుమీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మహబూబాబాద్ పట్టణంలో తన నివాసంలో గిరిజన నాయకులు, కా ర్యకర్తలతో కలిసి పటాకులు పేల్చి సంబురాలు జ రుపుకున్నారు. అనంతరం మంత్రి నివాసంలో కేక్ కట్ చేశారు.