వెంకటాపూర్, ఆగస్టు 25 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ అన్నారు. గురువా రం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణారెడ్డి అధ్యక్షతన పలువురు పార్టీలో చేశారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లడుతూ.. ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రధానమంత్రి మోదీకీ వణుకు పుడుతున్నదని, అందువల్లే తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. బీజేపీ నాయకులు ప్రజాస్వామ్య బద్ధంగా కార్యక్రమాలు చేస్తే ఎవరూ ఆపరని, కేసీఆర్పై అనుచిత వాఖ్యలు చేస్తూ బండి సంజయ్ లాంటి వ్యక్తులు యాత్ర లు చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించా రు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదన్నారు. పార్టీలో చేరిన వారిలో నరెడ్ల జనార్దన్, బూస రమేశ్, నరేందర్, సత్యనారాయణ, నరేశ్, ఎండీ రహీమొద్దీన్, లక్ష్మీనరసింహస్వామి, మహేందర్, సదయ్య, రఘుతో పాటు సుమారు 200 మంది చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యో తి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పళ్లా బుచ్చయ్య, ఎంపీపీ బుర్ర రజితాసమ్మయ్య, జడ్పీటీసీ గై రుద్రమదేవీఅశోక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్క రమేశ్, పోరిక గోవింద్ నాయక్, ఏటూరు నాగారం మండలాధ్యక్షుడు సునీల్కుమార్, ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి, సర్పంచ్లు సుచరితాశ్రీధర్రెడ్డి, అశోక్, రజితాశ్రీనివాస్, కుమారస్వామి, జగన్మోహన్రావు, అన్ని గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.