నమస్తే నెటవర్క్: ఉమ్మడి జిల్లాలో జాతీయ జెండాలతో ర్యాలీలు, ప్రదర్శనలు జోరుగా జరిగాయి. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం తిరంగా ర్యాలీలు ఊరూవాడన ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. త్రివర్ణ బెలూన్లను, కపోతాలను గాల్లోకి వదిలి సంబురాలు జరుపుకొన్నారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బెలూన్లను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, పోలీసు కమిషనర్ తరుణ్జోషి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు వేయిస్తంభాల దేవాలయం నుంచి ఫ్రీడం ర్యాలీ తీశారు. వరంగల్ జిల్లా కోర్టు నుంచి కాళోజీ సెంటర్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ఎర్రగట్టు గుట్ట నుంచి హసన్పర్తి వరకు యువకులు, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రమేశ్ జాతీయ జెండాను చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించి దేశ భక్తిని చాటా రు.
పరకాలలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. వర్ధన్నపేట, రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు మహనీయుల వేషధారణతో ఆకట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎస్పీ జే సురేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. చిట్యాలలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీశారు. మహదేవపూర్ జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. జనగామలో 175 మీటర్ల పొడవైన జాతీయజెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పాల్గొని ఉత్సాహ పరిచారు. మహబూబాబాద్లో ఎమ్మెల్యే శంకర్నాయక్ నేతృత్వంలో భారీ ర్యాలీ ఇందిరాగాంధీ సెంటర్ వరకు కొనసాగింది. తొర్రూరులో కలెక్టర్ కే శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో బైక్ నడుపుతూ, రిక్షాకు జాతీయ జెండా కడుతూ సందడి చేశారు. చిన్నగూడూరులో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొని జాతీయ జెండా రంగులో ఉన్న బెలూన్లను ఎగురవేశారు.