సంగెం, ఆగష్టు 13: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని 59 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు శనివారం హనుమకొండలోని తన నివాసంలో రూ. 59 లక్షలకు పైగా విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. బీజేపీ సంక్షేమ పథకాలకు అడ్డుగా నిలుస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, తహసీల్దార్ రాజేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారంగపాణి, సర్పంచ్లు కిశోర్యాదవ్, సుదర్శన్, నాయకులు వీరభద్రయ్య, నరేశ్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు న్యూట్రికిట్స్ పంపిణీ
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 15 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి న్యూట్రికిట్స్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు చేయూతనందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అనాథ పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యతోపాటు భోజన సదుపాయం కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. సంగెం, ఖిలావరంగల్, గీసుగొండ మండలాలకు చెందిన 15 మందికి కిట్స్ను అందించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీడీపీవో శ్రీదేవి, వరంగల్ సీడీపీవో విష్వజ, సూపర్వైజర్లు కల్యాణి, ఉమాదేవి, రేవతి, అనితకుమారి, అన్నపూర్ణ పాల్గొన్నారు.